రాజస్థాన్లోని బుండిలో మంగళవారం దారుణం జరిగింది. హనుమాన్ జయంతి ఊరేగింపు తర్వాత స్థానికంగా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ సమయంలో స్టేజిపై ఉన్న వ్యక్తిపై మరో వ్యక్తి వెనుక నుంచి దాడి చేశాడు. గొడ్డలితో బాధితుడిని గాయపరిచాడు. దీంతో బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా పారిపోయారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతకక్షల వల్ల దాడి చేసినట్లు తేల్చారు.