ఛత్తీస్గఢ్లోని సర్గుజాలో బుధవారం మోడీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. మధ్యతరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని ‘యువరాజు’(రాహుల్ గాంధీ) మరియు రాజకుటుంబ సలహాదారు(శామ్ పిట్రోడా) చెబుతున్నారని మోడీ అన్నారు. వారసత్వవపు పన్ను విధిస్తామని, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిపై పన్ను విధిస్తామని కాంగ్రెస్ అంటోంది. మీరు కష్టపడి కూడబెట్టిన సంపద మీ పిల్లలకు దక్కదు. కాంగ్రెస్ లాగేసుకుంటుందని మోడీ ఆరోపించారు.