సీఎం రేవంత్ అబద్ధాలు చూసి తన సమాధిలో గోబెల్స్ ఉలిక్కిపడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. 'రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ యత్నిస్తున్నాయి. తెలంగాణలో బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్ఎస్ వ్యతిరేకించింది. రాష్ట్ర ఆస్తులు, హక్కులు, వనరులు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని రంగాలకు ద్రోహం చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారు' అని కేటీఆర్ అన్నారు.