పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు.. పీసీబీ ఏమందంటే?

78చూసినవారు
పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు.. పీసీబీ ఏమందంటే?
లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్‌ జట్టుపై నెట్టింట ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తమ ఆటగాళ్లను పీసీబీ వెనకేసుకొచ్చింది. తమకు ఎలాంటి అనుమానాలు లేవని, విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆరోపణలు చేసినవారు ఆధారాలతో వస్తే విచారణ జరిపి ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు నిరాధార ఆరోపణలు చేసినవారికి పరువు నష్టం దావా కింద నోటీసులు పంపేందుకు పీసీబీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్