అనంతపురం జిల్లా నార్పలలో దారుణం

35274చూసినవారు
ఏపీలోని అనంతపురం జిల్లా నార్పలలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో గణేష్ వ్యక్తి తన కూతుర్ని చంపేశాడు. చిన్నారి మృతదేహాన్ని నార్పల బస్టాండ్ పక్కనే ఉన్న బావిలో పడేశాడు. పోలీసుల దగ్గరికెళ్లి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులతో కలిసి చిన్నారి కోసం వెతికాడు. అనుమానంతో తండ్రిని పోలీసులు విచారించారు. విచారణలో తండ్రే కూతుర్ని చంపినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్