రాజస్థాన్ జోధ్పూర్లో మత ఘర్షణలు చెలరేగాయి. రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. సూర్ సాగర్ ప్రాంతంలోని రాజారాం సర్కిల్ వద్ద దుకాణాలకు దుండగులు నిప్పంటించారు. ట్రాక్టర్ను, జీపును ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. శుక్రవారం రాత్రి వరకు పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు.