బీచ్ లంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. అలాంటి వారిని విశేషంగా ఆకర్షించే బీచ్లలో ఒడిశాలోని పూరీ బీచ్ ఒకటి. పూరీ జగన్నాథ దేవాలయ దర్శనం తరువాత చాలామంది ఇక్కడికి వస్తుంటారు. పూరీ బీచ్లో సముత్ర తీరం, గోల్డెన్ ఇసుక పర్యటకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తోంది. అలాగే ఇక్కడి సూర్యోదయాలు, సూర్యాస్తమయ దృశ్యాలు కూడా పర్యటకులను ఎంతోగానో ఆకట్టుకుంటాయి.