ఉత్తరాదిపై గత కొన్ని రోజులుగా భారీగా మంచు పడుతోంది. దీంతో అక్కడక్కడా అవలాంచ్లు ఏర్పడుతున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్లోని సోన్మార్గ్లో భారీ హిమపాతం (అవలాంచ్) ముంచెత్తింది. ఈ మంచు మొత్తం సింధ్ నదిపై పడటంతో నదీ ప్రవాహం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఆ నీరంతా రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నదిపై మంచు తొలగింపు పనులు చేపట్టారు. యంత్రాలను ఏర్పాటు చేసి మంచును తొలగిస్తున్నారు.