ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ రూ.7,130 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.5,728.4 కోట్ల నష్టాలు చవి చూసింది. ప్రయివేటు రంగంలోని ఈ బ్యాంక్ గడిచిన క్యూ4లో 11.5 శాతం వృద్థితో రూ.13,089 కోట్ల నికర వడ్డీపై ఆదాయం నమోదు చేసింది. 2023-24లో మెరుగైన ఫలితాలను సాధించామని యాక్సిస్ బ్యాంక్ ఎండి, సిఇఒ అమితాబ్ చౌదరీ పేర్కొన్నారు.