ఆన్‌లైన్‌ నమోదు లేకున్నా అయ్యప్ప దర్శనం

85చూసినవారు
ఆన్‌లైన్‌ నమోదు లేకున్నా అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్‌లో మాత్రమే నమోదు చేసుకోవాలన్న తమ నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతుండటంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకపోయినా భక్తులకు అయ్యప్ప దర్శనం కల్పిస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసెంబ్లీలో స్పష్టం చేశారు. వర్చువల్‌ నమోదు గురించి తెలియకుండా వచ్చిన వారికీ దర్శనం ఉంటుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్