ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ ఇన్స్టా పోస్ట్ వైరల్గా మారింది. నిన్న మ్యాచ్ సందర్భంగా ఆమె ‘బేబీ వస్తోంది. మ్యాచ్ను త్వరగా ముగించండి. కాబోయే అత్తగా నా రిక్వెస్ట్’ అని ఇన్స్టా స్టోరీ పెట్టారు. దీంతో ధోనీ మామ కాబోతున్నాడంటూ ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. నిన్నటి మ్యాచ్లో హైదరాబాద్పై చెన్నై 78 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.