తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాసేపట్లో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. చాలా నియోజకవర్గాల్లో రెబల్స్ బరిలో ఉన్నారు. ఏపీలోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4210 నామినేషన్లు, 25 లోక్ సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు 625 నామినేషన్లు నమోదయ్యాయి. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.