ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌గా బదానీ

72చూసినవారు
ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌గా బదానీ
ఐపీఎల్‌-2025 సీజన్‌‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌ హేమంగ్‌ బదానీని నియమించినట్లు తెలిపింది. అదే విధంగా డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ బాధ్యతలను మరో భారత మాజీ క్రికెటర్‌ వేణుగోపాల్‌ రావుకు అప్పగించినట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా.. గతంలో వీరిద్దరూ ఐపీఎల్‌లో ఆడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్