బాలాపూర్‌ లడ్డూ@రూ.30 లక్షలు

69చూసినవారు
బాలాపూర్‌ లడ్డూ@రూ.30 లక్షలు
బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాటలో ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.30 లక్షలకు ఓ భక్తుడు చేజిక్కించుకున్నారు. గత ఏడాది లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికింది. స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. 1994 నుంచి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్