ఏప్రిల్ 17న శ్రీరాముని పుట్టిన రోజు సందర్భంగా.. అయోధ్యలో 3 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించాలని శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత జరిగే తొలి కార్యక్రమం ఇదే కావడంతో.. ఉత్సవాలకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తారని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్సవాలు జరిగే 3 రోజులపాటు 24 గంటలు ఆలయ తలుపులు తెరిచి ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు.