కంపెనీలోకి ప్రవేశించి వ్యక్తిపై ఎలుగుబంటి దాడి

577చూసినవారు
కంపెనీలోకి ప్రవేశించి వ్యక్తిపై ఎలుగుబంటి దాడి
అడవిలో ఉండాల్సిన ఎలుగుబంటి జనావాసాల్లోకి వచ్చి దాడి చేసింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానిక అటవీ క్షేత్ర అధికారి గురు ప్రసాద్ వివరాల ప్రకారం..ఆ గ్రామంలో గల జె‌పి కంపెనీలో ఎలక్ట్రికల్ వైన్డర్‌గా పనిచేస్తున్న శత్రుజ్ఞ లాల్ అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. దీంతో ఆ వ్యక్తిని ఏపీలోని సున్నిపెంట వైద్య కేంద్రానికి పంపించి చికిత్స అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్