భానుడి ఉగ్రరూపం.. 54 మంది మృతి

54చూసినవారు
భానుడి ఉగ్రరూపం.. 54 మంది మృతి
భానుడి ఉగ్రరూపానికి ఢిల్లీ సహా తూర్పు, మధ్య, ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో 54 మంది మృత్యువాత పడ్డారు. బిహార్‌లో అత్యధికంగా 34 మంది మరణించారు. మృతి చెందిన ఓ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైనట్లు వైద్యులు గుర్తించారు. సాధారణ టెంపరేచర్ కంటే ఇది 10 డిగ్రీలు అధికం. ఆయా రాష్ట్రాల్లో 45-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఐఎండీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్