ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎన్టీఆర్కు భారతరత్నను కేంద్రం ప్రకటిస్తుందన్న వార్తలు వైరలవుతున్నాయి. ఇటీవల బీజేపీతో పొత్తుల గురించి టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించిన సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలన్న ప్రతిపాదనను కేంద్ర పెద్దల ముందు ఉంచారని.. దీనికి వారు సైతం సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. నేటి కేంద్ర కేబినేట్ భేటీలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడంపై నిర్ణయం వెలువడుతుందని సమాచారం.