షహరాన్పూర్లోని భైలా గ్రామానికి చెందిన అంకిత్ అనే వ్యక్తికి మీరట్లోని కుషావలీ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో అంకిత్ తన గ్రామం నుంచి వధువు ఇంటివద్ద గల పెళ్లి మండపానికి కారు టాప్ పైకి ఎక్కి విగ్రహంలా నిల్చొని ఊరేగింపుగా బయల్దేరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విషయం తెలుసుకున్న మన్సూర్పూర్ పోలీసులు ఊరేగింపుకు ఉపయోగించిన ఎస్యూవీ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.