భట్టి ఎఫెక్ట్.. యాదాద్రి ఆలయంలో కొత్తగా 10 పీటలు కొనుగోలు

1034చూసినవారు
భట్టి ఎఫెక్ట్.. యాదాద్రి ఆలయంలో కొత్తగా 10 పీటలు కొనుగోలు
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో భాగంగా లక్ష్మీనరసింహా స్వామీ ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసిన ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో సమాంతరంగా ఉండే 10 కొత్త పీటలను కొనుగోలు చేశారు. ఇక నుంచి వీవీఐపీ, వీఐపీలు వచ్చే సమయంలో ప్రొటోకాల్ ప్రకారం గౌరవ మర్యాదలకు భంగం రాకుండా, ప్రతి ఒక్కరికీ సమాంతరంగా ఉండే పీటలు వేసేలా చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్