పదో తరగతి విద్యార్థిపై బెల్టులతో దాడి (వీడియో)

1131చూసినవారు
పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై కొందరు యువకులు బెల్టులతో దాడి చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. జెడ్పీ హైస్కూల్ బయట పదో తరగతి విద్యార్థి హేమంత్ కుమార్‌పై దాడి చేశారు. స్థానికులు అడ్డుపడటంతో హేమంత్‌ను వదిలేశారు. ప్రస్తుతం హేమంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్