కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. SBI, ICICI బ్యాంక్, YES బ్యాంక్, Axis బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. SBI రివార్డ్ పాయింట్లను నిలిపివేయనుంది. ICICI, YES బ్యాంకులు లాంజ్ యాక్సెస్లో రూల్స్ను సవరించాయి. Axis రివార్డ్ పాయింట్ల, లాంజ్ యాక్సెస్తో పాటు వార్షిక రుసుముల్లో మార్పులు చేసింది.