ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒకరోజు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో కొత్త వ్యక్తిని పరిచయం చేసింది. యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్కు పగ్గాలు ఇచ్చింది. తాజాగా ఐపీఎల్ ట్రోఫీతో 10 జట్ల కెప్టెన్లు ఇచ్చిన ఫోటో షూట్లో ధోనీ స్థానంలో గైక్వాడ్ వచ్చాడు.