కోనసీమ జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. అమలాపురం సిట్టింగ్ MP చింతా అనురాధ భర్త TSN మూర్తి బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. తన భార్యకు వైసీపీలో సీటు దక్కకపోవడం, తాను ఆశించిన పి.గన్నవరం అసెంబ్లీ టికెట్ను కూడా వైసీపీ కేటాయించకపోవడంతో మూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా పురంధేశ్వరితో భేటీ అయిన మూర్తి త్వరలోనే కమలం పార్టీలో చేరతారని సమాచారం.