బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్.. 20 మంది కౌన్సిలర్లు రాజీనామా

333813చూసినవారు
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్.. 20 మంది కౌన్సిలర్లు రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అధికారం కోల్పోవడంతో గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో 20 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒకేసారి 20 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయడంతో కొత్తగూడెం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్