రాష్ట్ర చరిత్రలోనే రూ.వేలకోట్ల కుంభకోణం

68చూసినవారు
రాష్ట్ర చరిత్రలోనే రూ.వేలకోట్ల కుంభకోణం
విశాఖ చుట్టుపక్కల రూ.వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ముందస్తుగానే రైతులను ప్రలోభపెట్టారు. మొత్తం ఎసైన్డ్‌ భూములను రాయించుకుని జీవో తీసుకొచ్చారు. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఫ్రీహోల్డ్‌ పట్టాలు రైతుల దగ్గరే ఉన్నాయా? వైసీపీ నేతల దగ్గర ఉన్నాయా? అని సీఎస్‌ని ప్రశ్నిస్తే సమాధానం లేదు' అని మూర్తియాదవ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్