మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపైఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో సీఈవో వికాస్రాజ్ను బీజేపీ ప్రతినిధుల బృందం కలిసింది. బీజేపీ నేత ఈటల రాజేందర్పై మార్ఫింగ్ వీడియోలతో ప్రచారం చేశారని ఫిర్యాదు చేసింది. వీడియోలు మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.