తెలంగాణలో బీజేపీ ఇప్పటికే 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. అయితే వరంగల్ నుంచి మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్ పేరును పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇటీవల పార్టీలో చేరిన మాజీ సీఎం కొడుకు జలగం వెంకటరావు పేరును ఖమ్మం ఎంపీ స్థానానికి ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.