మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి బీజేపీ నేతృత్వంలో మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు, నితీష్ కుమార్ ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో తాము కీలకంగా మారడంతో కీలక పదవులపై కన్నేశారు. అయితే కేంద్ర ప్రభుత్వంలోని 4 కీలక మంత్రిత్వ శాఖలైన రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలను తామే చేజిక్కించుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందట.