లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జల్గావ్కు చెందిన బీజేపీ ఎంపీ ఉన్మేష్ పాటిల్ బుధవారం రాజీనామా చేశారు. అనంతరం ముంబైలో ఉద్ధవ్ థాక్రే సమక్షంలో శివసేన (UBT)లో చేరారు. జల్గావ్ నియోజకవర్గం నుంచి ఉన్మేష్ పాటిల్కు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఈ సారి స్మితా వాగ్కు బీజేపీ టికెట్ ప్రకటించింది. దీనిపై ఆగ్రహించిన పాటిల్ తన మద్దతుదారులతో సహా బీజేపీకి రాజీనామా చేశారు.