చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్!

547చూసినవారు
చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్!
లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు సార్లు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన తొలి పేసర్‌గా నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో మయాంక్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో షాన్ టెయిట్ వేసిన 157.7 కిలోమీటర్ల బాల్ ఫాస్టెస్ రికార్డ్‌గా నమోదైంది.

సంబంధిత పోస్ట్