లోక్సభ ఎన్నికల వేళ ఓ అభ్యర్థి నామినేషన్ హాట్ టాపిక్ అయ్యింది. మహారాష్ట్రలోని బుల్దానా స్థానానికి మహారాష్ట్ర లోక్షాహి వికాస్ అఘారీ అభ్యర్థి అసలాం షా హసన్ షా వెరైటీగా నామినేషన్ దాఖలు చేశారు. ఒక్క రూపాయి నాణేలు తీసుకొచ్చి డిపాజిట్ సమర్పించారు. నాణేల మూటతో వచ్చిన అతన్ని చూసి ఎన్నికల అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ సొమ్ము లెక్కించేందుకు సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది.