ఈ ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఎత్తులు వేస్తోంది. ముందస్తు వ్యూహంగా యాడ్స్ రూపంలో విపరీతంగా ఖర్చు పెట్టింది. ఆన్లైన్ యాడ్స్ కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది. కేవలం ఈ ఏడాది నాలుగు నెలల కాలంలో ఆన్లైన్ యాడ్స్ కోసం బిజెపి సుమారు రూ.39 కోట్లు ఖర్చు చేసిందని గూగుల్ యాడ్స్ ట్రాన్స్ప్రెన్సీ సెంటర్ లెక్కలే చెబుతున్నాయి. నాలుగు మాసాల్లో 80,667 గూగుల్ రాజకీయ ప్రకటనల కోసం రూ.39 కోట్లు చెల్లించింది.