పశ్చిమ బెంగాల్లో ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్ ఉన్న దృశ్యాలు వైరలవడంపై EC స్పందించింది. ‘‘పోలింగ్ కేంద్రాల్లో EVMలను పెట్టినప్పుడు వాటిపై అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలకు సంబంధించి బీజేపీ అభ్యర్థికి చెందిన ఏజెంట్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. అందుకే ఆయన సంతకం తీసుకున్నాం. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఏర్పాటు సమయంలో నిబంధనలు పాటిస్తాం’’అని ఈసీ స్పష్టంచేసింది.