అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ బీఆర్ఎస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఎన్నికలకు మందు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు కే.కేశవరావు కాంగ్రెస్లో చేరారు. తాజాగా కేసీఆర్ విధేయుల్లో ఒకరైన పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణంచుకోలేకపోతున్నాయి. పోచారానికి 'లక్ష్మీపుత్రుడు' అని పేరు పెట్టిన కేసీఆర్.. గతంలో ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి, అసెంబ్లీ స్పీకర్ పదవులు ఇచ్చారు.