ఆఫ్రికాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. మారిటేనియా నుంచి ఐరోపాకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోటు బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 15 మంది మృతి చెందగా, 150 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. బోటులో మొత్తం 300 మంది వలసదారులు ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని 120 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.