పశ్చిమబెంగాల్‌లో సిక్కిం మాజీ మంత్రి మృతదేహం

76చూసినవారు
పశ్చిమబెంగాల్‌లో సిక్కిం మాజీ మంత్రి మృతదేహం
సిక్కిం మాజీ మంత్రి ఆర్‌సీ పౌడ్యాల్ (80) మృతదేహాన్ని పశ్చిమబెంగాల్‌లోని సిలిగుడిలోని తీస్తా నదిలో కనుగొన్నారు. సిక్కింలోని పాక్యాంగ్‌లోని చోటా సింగ్తమ్ పౌడ్యాల్ స్వగ్రామం. ‘ఆయన మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది’ అని పోలీసులు పేర్కొన్నారు. పౌడ్యాల్ మృతిపై సిక్కి సీఎం పీఎస్ తమాంగ్ స్పందించారు. ‘ఆర్సీ పౌడ్యాల్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. వివిధ హోదాల్లో ఆయన సిక్కిం రాష్ట్రానికి సేవలు అందించారు’ అని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్