పాకిస్తాన్లో నిత్యం ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. తాజాగా శనివారం రాత్రి పెషావర్లోని ప్రముఖ కబాబ్ రెస్టారెంట్లో బాంబు పేలుడు జరిగింది. రెస్టారెంట్ యజమానికి ఉగ్రవాదులు ఫోన్ చేసి డబ్బులు అడిగినట్లు సమాచారం. ఆయన ఇవ్వకపోవడంలో బాటిల్లో బాంబు అమర్చి దానిని ఉగ్రవాదులు పేల్చేశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.