ఎయిర్ ఇండియాకు చెందిన AI 149 విమానం లండన్ గాట్విక్ వెళ్లేందుకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వేపై మంగళవారం తెల్లవారుజామున సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఈ విమానంలో బాంబు పెట్టినట్లు కొందరు ఆగంతకులు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్కు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అన్ని తనిఖీలు అనంతరం అదే విమానంలో లండన్ వెళ్లేందుకు సిద్ధమైన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 29 ఏళ్ల సుహైబ్ను అధికారులు అరెస్ట్ చేశారు.