భారత లోక్సభ చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. లోక్సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది. ఎన్నిక విషయంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కేరళలోని కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ ఇండియా కూటమి తరపున నామినేషన్ దాఖలు చేశారు. NDA నుంచి ఓం బిర్లా పోటీకి సిద్ధమయ్యారు. రేపు సభలో స్పీకర్ ఎన్నిక జరగనుంది.