మళ్లీ బాంబు బెదిరింపులు.. ఈసారి 10 పాఠశాలలకు!

70చూసినవారు
దేశంలో ఇటీవల బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఇవాళ ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సుమారు 10 స్కూళ్లను పేల్చేస్తామని ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్‌కు ఈ మెయిల్ ద్వారా సమాచారం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ ఎటువంటి అనుమానిత వస్తువులను కనుగొనలేదు. ఈ మెయిల్‌ను పంపడానికి నిందితులు రష్యన్ సర్వర్‌లను ఉపయోగించినట్లు వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్