దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు లాభపడి 77,301 వద్ద ముగియగా, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 23,557 వద్ద ముగిసింది. పవర్గ్రిడ్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇంట్రాడేలో 77,071.44- 77,366.77 మధ్య కదలాడింది. చివరికి 308.37 పాయింట్ల లాభంతో 77,301.14 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 92.30 పాయింట్ల లాభంతో 23, 557.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.42గా ఉంది.