ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకం

574చూసినవారు
ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకం
ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. దీనిపై శాసనమండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఆయన ఇటీవల ఎన్నికయ్యారు. ఆ తర్వాత శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. ఆ స్థానంలో బొత్సను పార్టీ అధినేత జగన్ నియమించారు. YSRతో పాటు జగన్ హయాంలోనూ బొత్స మంత్రిగా పని చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్