నా అభిమానులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా : ఎన్టీఆర్‌

51చూసినవారు
ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన దేవ‌ర చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా స‌క్సెస్ ఈవెంట్‌ను చిత్రబృందం నిర్వ‌హించింది. ఈ స‌క్సెస్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'ఈ స‌క్సెస్ ఈవెంట్‌ను ఎంతో కోలాహలంగా, గ్రాండ్‌గా అభిమానులంద‌రితో జ‌రుపుకోవాలనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కార‌ణాల కుదరలేదు. ఇంతటి భారీ స‌క్సెస్‌ను అందించిన‌టువంటి ప్రేక్ష‌క దేవుళ్లందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్