తిరుపతి కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

68చూసినవారు
తిరుపతి కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆగ‌మ స‌ల‌హాదారు, కంకణబట్టార్ సీతారామాచార్యులు ఆధ్వర్యంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్