కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో వరి సేకరణను తగ్గించి, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్లలో గోధుమల సేకరణను భారీగా పెంచింది. భారత్ బ్రాండ్ పేరుతో అమ్మకాలను పెంచాలని కేంద్రం భారీ లక్ష్యంగా పెట్టుకుంది. గోధుమల సేకరణ గతేడాది 6.5 లక్షల మెట్రిక్ టన్నులు (LMT ) ఉండగా, ఈ ఏడాది 50 (LMT)కి పెంచినట్లు ఆహార మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి వరి సేకరణలో భారీగా కోత విధించిన సంగతి తెలిసిందే.