జనన వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న 'కుటుంబ మతం' డిక్లరేషన్కు భిన్నంగా, ప్రతిపాదిత బర్త్ రిపోర్ట్లో తమ మతాన్ని వేరువేరుగా, వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. దత్తత తీసుకునే తల్లిదండ్రులకు ఇదే వర్తిస్తుందని పేర్కొంది. వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాలని వెల్లడించింది.