జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై శుక్రవారం ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. భూకుంభకోణంలో సోరెన్ రూ. 600 కోట్ల మేర అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు చార్జిషీటులో పేర్కొంది. ల్యాండ్ మాఫియాలో సోరెన్ భాగమని, మాఫియాలో వచ్చిన అక్రమ ఆదాయాన్ని కలిగి ఉన్నారని తెలిపింది. సోరెన్కు చెందిన 8.86 ఎకరాల భూమికి సంబంధించి కీలక సమాచారం కలిగిన 44 పేజీల ఫైల్ను విచారణ సమయంలో ప్రతాప్ కార్యాలయంలో గుర్తించామని తెలిపింది.