మెదడును తినే అమీబా.. మరో కేసు

72చూసినవారు
మెదడును తినే అమీబా.. మరో కేసు
కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (మెదడును తినే అమీబా) మరో కేసు నమోదైంది. కోజికోడ్ జిల్లాలోని పయోలిలో 14 ఏళ్ల బాలుడిలో ఇది కనిపించింది. ప్రస్తుతం బాలుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో కేరళలో మొత్తం కేసులు 4కు చేరాయి. ఇది సరస్సులు, నదులలలో వృద్ధి చెందే ఏక కణ జీవి. కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. మెదడు కణజాలాలను దెబ్బతీసి ప్రాణం పోయేలా చేస్తుంది.

సంబంధిత పోస్ట్