భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిన ఒక బ్రిటీష్ పర్యాటకుడు అనుకోని విధంగా ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. సామ్ పెప్పర్ అనే UK యూట్యూబర్ తన భారత పర్యటనలో భాంగ్ లస్సీ అనే సాంప్రదాయ భారతీయ పానీయాన్ని సేవించాడు. తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలతో అతడు మెలికలు తిరిగిపోయాడు. దీంతో ఆసుపత్రి పాలయ్యాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జరిగిన ఈ ఘటనతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సామ్ తాగిన ఈ పానీయం గంజాయి మొక్క నుండి తయారు చేస్తారు.